శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు

శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు

ప్రముఖ బాలీవుడ్ కామెడియన్ గోవిందా గురువారం శివసేనా పార్టీలో చేరారు. ఆయనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గోవిందాకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. 2004లో కాంగ్రెస్ నుంచి ముంబై నార్త్ ఈస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా ఎన్నికైన గోవిందా 2008లో తన పదవికి రాజీనామా చేశారు.  2009 వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత క్రియాశీలకంగా రాజకీయాల నుంచి తప్పకున్నాడు. మల్లీ ఈరోజు శివసేనాలో చేరారు.

ఇండస్ట్రీలో ఆయన్ని చిచ్చి అని ముద్దుగా పిలుచుకుంటారు. గోవిందా 1990లో అనేక హిందీ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ముంబై నార్త్ ఈస్ట్ స్థానం నుంచే గోవిందా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోవిందా మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఇది సెకండ్ ఆయనకు ఇన్నింగ్స్ లాంటిదని ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే అన్నారు.