
ఇంటికి మొక్కలు అందాన్ని ఇస్తాయి. పురాణాల ప్రకారం వేప చెట్టును పూజిస్తే లక్ష్మీదేవి స్థిరంగా ఆ ఇంట్లో ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే పెరట్లో కరివేపాకు మొక్క పెంచడం వల్ల అద్భుత ప్రయోజనాలున్నాయని వాస్తు శాస్త్రం చెప్తోంది. అసలు ఈ మొక్కను ఇంట్లో ఏ దిక్కున పెంచితే మంచిదే.. దీని వల్ల ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకుందాం. . .
ఇంటి ఆవరణలో సాధారణంగా మొక్కలు పెంచుకుంటాం.. పూల మొక్కలు.. ఆకు కూరలు.. బెండ.. దొండ.. ఇలాంటివి ఎన్నో నాటుతాం. స్థలం విశాలంగా ఉంటే వేపచెట్టును పెంచుతాం కదా.. అయితే ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది అపార్ట్ మెంట్లలో ఉంటున్నారు. అలాంటి వారు కుండీలలో మొక్కలను పెంచుకుంటున్నారు. కరివేపాకు మొక్క వలన ఆరోగ్యమే కాదు ఐశ్వర్యం కూడా వస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. అయితే కరివేపాకు మొక్కను పెంచేందుకు కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం.. కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచడం వలన అంతాశుభమే జరుగుతుందని వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది. ఈ మొక్క కేవలం ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెబుతున్నారు. ఇంతా పాజిటివ్ ఎనర్జీ.. సంపద.. సంతోషాన్ని కూడా కలుగజేసే లక్షణాలు కరివేపాకు మొక్కలో ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం కరివేపాకు మొక్క వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్కను సరైన దిశలో నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం పడమర దిశ కరివేపాకు మొక్కను నాటడానికి అత్యంత అనుకూలమైనది. ఈ దిశను చంద్రుడి దిశగా పరిగణిస్తారు. ఇక్కడ మొక్కను పెంచడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ప్రతికూల శక్తి తొలగిపోయి, ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
కొంతమంది ఇంటికి ఆగ్నేయ దిశలో (తూర్పు -దక్షిణ మూల) కూడా కరివేపాకు మొక్కకు చాలా మంచిదని సూచిస్తారు. ఈ దిశ సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఈ దిశలో మొక్కను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధి, సామరస్యం పెరుగుతాయి.
ఏ దిశలో నాటకూడదు?
కరివేపాకు మొక్కను ఇంటి ఈశాన్య దిశలో (ఉత్తర- తూర్పు మూల) అస్సలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి, దురదృష్టం ప్రవేశిస్తాయని చెబుతారు. మురుగు నీరు ప్రవహించే ప్రాంతంలో పొరపాటున కూడా ఈమొక్కను నాటవద్దని వాస్తు పండితులు సూచిస్తున్నారు.
ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కకు పురుగు పట్టకుంగా .. ఆరోగ్యంగా పెరిగేలా శ్రద్ద వహించాలి. మొక్క ఎండిపోకుండా.. కుళ్లి పోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన కరివేపాకు మొక్క ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబసభ్యల మధ్య గొడవలు.. అనేక ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం కరివేపాకు మొక్క ఇంట్లో ఉండటం కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ఆకులలో యాంటీ మ్యుటాజెనిక్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడతాయి. కరివేపాకు మొక్క ప్రశాంతతను, మానసిక సమతుల్యతను చేకూర్చుతుంది.
కరివేపాకు మొక్క కూడా లక్ష్మీదేవితో సమానమని వాస్తు పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం, సాయంత్రం వేళల్లో కరివేపాకు ఆకులను మొక్క నుండి తెంపకూడదు. ఇది ఇంటికి నష్టాన్ని కలిగించవచ్చు. చాలా మంది ఇరుకు పొరుగు వారు రెండు రెమ్మలు కరివేపాకు ఇమ్మని అడుగుతుంటారు. అయితే.. మంగళవారం.. శుక్రవారం ఇవ్వకూడదు. అలాగే సాయంవేళలో ( దీపాలు వేసిన తరువాత) కూడా ఇవ్వకూడదు. మొత్తంగా, కరివేపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అనేక ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం సూచిస్తుంది.