మమ్మల్ని జోనల్ లెవెల్​లో అడ్జెస్ట్ చేయండి .. ఇంటర్ కమిషనర్​కు గెస్ట్‌ లెక్చరర్ల విజ్ఞప్తి

మమ్మల్ని జోనల్ లెవెల్​లో అడ్జెస్ట్ చేయండి .. ఇంటర్ కమిషనర్​కు గెస్ట్‌ లెక్చరర్ల విజ్ఞప్తి

హైదరాబాద్,వెలుగు: సర్కారు కాలేజీల్లో ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమను ఖాళీలకు అనుగుణంగా జోనల్ లెవెల్ లో అడ్జెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని గెస్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్ పాషా కోరారు. బుధవారం ఇంటర్ బోర్డులో కమిషనర్ కృష్ణ ఆదిత్య, ఆర్జేడీ జయప్రదబాయిని ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యాకుబ్ పాషా మాట్లాడుతూ..కొత్తగా రెగ్యులర్ లెక్చరర్లు రావడంతో డిస్టర్బ్ అయిన గెస్టు లెక్చరర్లను జిల్లాస్థాయిలో అడ్జెస్ట్ చేస్తున్నారని గుర్తుచేశారు. 

కానీ, జోనల్ లెవెల్ లో ఈ ప్రక్రియ నిర్వహించాలన్నారు. సీనియార్టీ ప్రకారం అడ్జెస్టు చేయాలని కోరారు. దీనికితోడు పెండింగ్ జీతాలూ రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పనిచేసిన 620 మందిని కంటిన్యూ చేస్తామని, ఈనెలాఖరులో గా ప్రమోషన్ల ప్రక్రియ తర్వాత ఏర్పడే ఖాళీలను, కొత్త కాలేజీల్లోని వెకెన్సీలు 400 మందిని అడ్జెస్ట్ చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు వారు చెప్పారు.