గుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ

గుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ

గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులను లెక్కించడం చాలా కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పటిలాగే రాష్ట్రం అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు. గుజరాత్లో మూడో రోజు పర్యటించిన మోడీ.. అహ్మదాబాద్లో సుమారు 1275 కోట్ల రూపాయల విలువైన హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి శంకుస్థాపన చేశారు. 

గుజరాత్ లో క్యాన్సర్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కోసం కొత్త భవనంతో పాటు అప్గ్రేడ్ చేసిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వంటి సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని మోడీ తెలిపారు. ఇది సైబర్ నైఫ్ వంటి ఆధునిక సౌకర్యాలను అందించే మొదటి ప్రభుత్వ ఆస్పత్రి అని అన్నారు.