గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ

గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియబోతోంది. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. వీటిలో 142 జనరల్ కాగా..17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. గుజరాత్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండేది. కానీ.. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తోంది. ప్రచారంలోనూ బీజేపీపై పదునైన విమర్శలతో ముందుకెళ్తోంది. దీంతో ఈసారి త్రిముఖ పోటీ ఏర్పడింది. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1621 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లలో 61 మంది అభ్యర్థులతో ఆప్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి 60 మంది, బీజేపీ నుంచి 32 మంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు.