గుజరాత్ లో 12న ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న మోడీ

గుజరాత్ లో 12న ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న మోడీ

గుజరాత్ లో ఏడోసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ చెప్పారు. 12న మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు.  గుజరాత్ లో ఎప్పుడూ లేని విధంగా 150కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.

https://twitter.com/ANI/status/1600764072852537345

2002లో ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 127 సీట్లతో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. అంతకుముందు మాధవ్‌సింగ్ సోలంకి నాయకత్వంలో 149 సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. దాదాపు 30 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోడీ చరిష్మాతో 1995 నుంచి ఎన్నికల్లో ఓడిపోకుండా 27 ఏళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ..మళ్లీ అధికారం వైపు అడుగులు వేస్తోంది. 

పశ్చిమబెంగాల్‌లో వరుసగా ఏడు సార్లు వామపక్ష ఫ్రంట్ సాధించిన ఘనతను సమం చేయడానికి గుజరాత్ లో బీజేపీ సిద్ధంగా ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మందగించిన వృద్ధి రేటు, నిరుద్యోగంపై ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడినప్పటికీ, దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా ఉన్న గుజరాత్‌లో 2001 నుండి 2014 వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌లో బీజేపీ ప్రజాదరణను దెబ్బతీనలేదనడానికి ఈ సారి వస్తోన్న రెస్పాన్సే ఉదాహరణ.