గుంటూరు కారం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

గుంటూరు కారం బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలై.. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. మిక్స్డ్ టాక్ తో మొదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.164కోట్లు వసూల్ చేసి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని చూసేందుకు ఎక్కువగా వస్తుండడం కలిసొచ్చింది. 

తన కెరీర్ లో మరో సూపర్ హిట్ మూవీగా గుంటూరు కారం నిలవడంతో మహేష్ బాబు.. చిత్రయూనిట్ కు పార్టీ ఇచ్చారు. సంక్రాంతి పండగ కూడా కలిసి రావడంతో సోమవారం మహేష్ తన నివాసంలో మూవీ టీమ్ తో కలిసి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ పార్టీకి హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రీలీల, నిర్మాతలు నాగ వంశీ, దిల్ రాజు దంపతులు హాజరయ్యారు. చిత్రయూనిట్ తోపాటు మహేష్ బాబు భార్య నమ్రత, కూతరు సితార, ఆమె ఫ్రెండ్స్ కూడా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.  ఈ పార్టీ ఫోటోలను మహేష్ తన ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.