Guntur Kaaram OTT Official: సినీ లవర్స్కి గుడ్ న్యూస్.. గుంటూరు కారం OTT డేట్ వచ్చేసింది!

Guntur Kaaram OTT Official: సినీ లవర్స్కి గుడ్ న్యూస్.. గుంటూరు కారం OTT డేట్ వచ్చేసింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్స్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవుట్ అండ్ అవుట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. మొదటిరోజు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన గుంటురు కారం మూవీ లాంగ్ రన్ లో రూ.215 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. 

ఇక గుంటూరు కారం థియేట్రికల్ రన్ ముగియడంతో.. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా గుంటూరు కారం ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులని ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 9 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

నిజానికి గుంటూరు కారం సినిమాకు మిక్సుడ్ టాక్ రావడంతో.. థియేటర్ కు వెళ్ళడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. కాబట్టి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా. మరి థియేటర్స్ లో మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.