గుంటూరు కారం OTT రిలీజ్ ట్విస్ట్.. కేవలం 28 రోజుల్లోనే!

గుంటూరు కారం OTT రిలీజ్ ట్విస్ట్.. కేవలం 28 రోజుల్లోనే!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh babu), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. నిజానికి ఈ సినిమాకు మొదటిరోజు నుండే మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. విడుదలైన కేవలం వారం రోజుల్లోనే ఏకంగా రూ.210 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది గుంటూరు కారం మూవీ. 

ఇదిలా ఉంటే.. తాజాగా గుంటూరు కారం ఓటీటీలో రిలీజ్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కారం మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌ కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం విడుదలైన 28 రోజుల తరువాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలని డిసైడ్ ఆయారట. ఆ ప్రకారం ఫిబ్రవరి రెండవ వారంలో  మహేష్ గుంటూరు కారం ఓటీటీకి వచ్చే అవకాశం ఉంది. ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ తో సహా కామన్ ఆడియన్స్ కూడా హ్యాపీ గా ఫీలవుతున్నారు. 

ఇక గుంటూర్ కారం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. హారిక హాసిని క్రియేషన్స్ పై చినబాబు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.