
మిల్కీ బ్యూటీ తమన్నా, టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'గుర్తుందా శీతాకాలం'. నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్.ఎస్. రెడ్డి, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. అయితే తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సినిమాను జులై 15న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకువస్తూనే ఉంటాయి. అలాంటి సంఘటనల సమాహారంతో ‘గుర్తుందా శీతాకాలం’ రూపొందిందని నిర్మాతల్లో ఒకరైన రామారావు తెలిపారు. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్టైల్’ కి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కి్ంచారు. సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి.