శ్రీలంకతో సిరీస్లు : టీ20లకు సారధిగా పాండ్యా.. వన్డేలకు కెప్టెన్గా రోహిత్

శ్రీలంకతో సిరీస్లు  : టీ20లకు సారధిగా పాండ్యా.. వన్డేలకు కెప్టెన్గా రోహిత్

వచ్చే నెలలో శ్రీలంక టీమ్ ఇండియాలో పర్యటించనుంది. ఇండియా టీమ్ తో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్, 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ల  కోసం బీసీసీఐ టీమిండియాను ప్రకటించింది. టీ20 సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.  సూర్యకుమార్ యాదవ్ కు వైస్ కెప్టెన్సీ దక్కింది. ఇక వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇందులో వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు.  వన్డే సిరీస్ ఇండియా టీమ్ విషయానికి వస్తే.. రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలకు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ ఎంపికయ్యారు. 

టీ20 సిరీస్ ఇండియా టీమ్ విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు ఈసారి టీమ్ లో లేరు. శివమ్ మావి, ముఖేష్ కుమార్, రాహుల్ త్రిపాఠి వంటి యువ ఆటగాళ్లకు టీ20 ఇండియా టీమ్ లో అవకాశం లభించింది. టీ20 మ్యాచ్ లు వరుసగా జనవరి 3న, 5న, 7న జరగనున్నాయి. జనవరి 10, 12, 15 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. 

టీ20 సిరీస్ కు ఇండియా  టీమ్ ఇదే..

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), దీపక్ హుదా, రాహుల్ త్రిపాఠి, సంజు సాంసన్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, అక్సర్ పటేల్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముకేశ్ కుమార్ 

వన్డే సిరీస్ కు ఇండియా టీమ్ ఇదే.. 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, మహ్మద్ షమీ, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్