- కాంగ్రెస్ గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ: హరీశ్రావు
- బీఆర్ఎస్లో చేరిన గద్వాల డీసీసీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అయ్యిందని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో జోగులాంబ గద్వాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు హరీశ్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, కాంగ్రెస్పార్టీకి ఎన్నికల్లో నిలబెడుదామంటే అభ్యర్థులే దొరకని పరిస్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు, రైతుబంధు, ఉచిత కరెంట్, ఆసరా పింఛన్లు లాంటి సంక్షేమ పథకాల పేర్లు మార్చి కాంగ్రెస్పార్టీ గ్యారంటీల పేరుతో మోసం చేయాలని చూస్తోందన్నారు.
ఆ పార్టీ ఇచ్చిన గ్యారంటీల అమలుకు ఎవరు గ్యారంటీ అని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్మేనిఫెస్టో అమలుకు సీఎం కేసీఆర్ గ్యారంటీ అని, గత తొమ్మిదిన్నరేళ్లుగా మేనిఫెస్టోలో చెప్పనివెన్నో అమలు చేశారని, అందుకు మళ్లీ ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. బీఆర్ఎస్పార్టీ అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల, ప్రచారంలో ఎట్లా ముందున్నదో ఎన్నికల్లో విజయం సాధించడంలోనూ ముందుంటుందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్జిల్లాలోని అన్ని సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని, గద్వాలలో మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అన్నారు. గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డిని మళ్లీ గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
పటేల్ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్పార్టీలో నాయకత్వ లేమి, డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతిని సహించలేక బీఆర్ఎస్లో చేరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో మళ్లీ గెలిచేది కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్పార్టీయేనన్నారు. జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ ఉమాదేవి, ఎంఐఎం కౌన్సిలర్బండి ప్రియాంక, గద్వాల ఎంఐఎం అధ్యక్షుడు సుదర్శన్, కాంగ్రెస్పార్టీ మండల శాఖల అధ్యక్షులు రాఘు నాయుడు, శ్రీకాంత్గౌడ్, విశ్వనాథ్రెడ్డి, డీసీసీ జనరల్సెక్రటరీ విజయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు పూల కరుణాకర్, అలెగ్జాండర్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.