టీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే  హుజురాబాద్ లో అభివృద్ధి

టీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే  హుజురాబాద్ లో అభివృద్ధి

టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే  హుజురాబాద్ లో అభివృద్ధి జరుగుతుందన్నారు మంత్రి హరీశ్. రాష్ట్ర ప్రభుత్వం ఈ  నియోజకవర్గానికి 4 వేల  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినప్పటికీ.. ఈటల ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. వర్షాల కోసం రైతులు ఎదురుచూడకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీటిని అందించిందన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు.  త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి రైతుల మీద పన్నుల భారం మోపుతోందన్నారు.