ఎన్ని కుట్రలు చేసినా దళితబంధు ఇచ్చి తీరుతం

ఎన్ని కుట్రలు చేసినా  దళితబంధు ఇచ్చి తీరుతం

ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో దళితబంధు అందరికీ ఇస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. 16న దళితబంధు ప్రారంభించనున్న సీఎం.. సభలో  15మందికి చెక్కులు అందిస్తారని చెప్పారు. BJPకి చెందిన కొన్ని సంఘాలు దళితబంధుపై అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. రైతుబంధు టైంలో కూడా కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేశాయని తెలిపారు. ఓటమిభయంతో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో దళితబంధు కోసం 2వేల కోట్లు కేటాయించామని.. గ్రామ సభలు నిర్వహించి ప్రజల మధ్యే అర్హులను ఎంపిక చేస్తామన్నారు హరీశ్. 50లక్షలు ఇవ్వాలంటున్న బండి సంజయ్.. తాము 10లక్షలు ఇస్తున్నామని.. మిగతా 40లక్షలు మీరు తీసుకురాండని సూచించారు. బీజేపీ వాళ్లు డబ్బులు తెస్తే.. పాలాభిషేకం చేస్తామన్నారు హరీశ్. దళిత సోదరులు అపోహలు, పుకార్లు నమ్మొద్దన్నారు. ఆరు నూరైన అర్హులైన ప్రతి కుటుంబానికి  దళిత బంధు అంది తీరుతుందన్నారు.