
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. ఇరిగేషన్శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే విచారణకు ఆయన అన్నివిధాలా సిద్ధమయ్యారు. మూణ్నాలుగు దఫాలుగా కేసీఆర్ తో చర్చలు జరిపారు. ఇంజినీర్ల నుంచి వివరాలు ఆరా తీశారు. కీలక డాక్యమెంట్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. అంతకు ముందు శుక్రవారం ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరుకావాల్సి ఉంది.