జీడిమెట్ల లోని 11 లక్షల విలువైన హాష్ ఆయిల్ సీజ్

 జీడిమెట్ల లోని 11 లక్షల విలువైన హాష్ ఆయిల్ సీజ్

జీడిమెట్ల, వెలుగు:  హాష్​ ఆయిల్​విక్రయిస్తున్న  ఒకరిని కుత్బుల్లాపూర్​ ఎక్సైజ్​పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కి తరలించారు. ఈస్ట్​గోదావరి జిల్లాలోని జగనాథపురానికి చెందిన జైసత్యసాయి అపురూపకాలనీలో హాష్​ఆయిల్​ విక్రయిస్తున్నాడనే సమాచారంతో బుధవారం ఎక్సైజ్​పోలీసులు దాడులు చేశారు. 

జై సత్యసాయి నుంచి రూ.11 లక్షల విలువ చేసే 500 గ్రాముల హాష్​ఆయిల్​తో పాటు స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు.