తప్పు జరిగింది..మరోసారి జరగకుండా చూసుకుంటాం

తప్పు జరిగింది..మరోసారి జరగకుండా చూసుకుంటాం

స్టెరిలైజేషన్ ప్రక్రియలో ఏదో పొరపాటు జరిగిందని హెల్త్ డైరెక్ట్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని నిపుణుల కమిటీ సందర్శించింది. ఆపరేషన్ జరిగిన థియేటర్, పరికరాలను పరిశీలించి..ఆపరేషన్లు జరిగిన తీరుపై వైద్యసిబ్బందిని ఆరా తీశారు. సుమారు 30 మంది వైద్య సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పారదర్శకంగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని.. రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని డీహెచ్ తెలిపారు. శనివారం వరకు ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చే అవకాశముందన్నారు.  

రాష్ట్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు 12లక్షలకుపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగాయని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ నెల 25న జరిగిన ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమని.. బాధిత కుటుంబాలకు అన్నివిధాల అండగా ఉంటామన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఏప్రిల్ నుంచి అగస్ట్ వరకు 5 క్యాంపులు జరిగాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందంజలో ఉన్నట్లు చెప్పారు.