ఆరోగ్య భారతే ప్రధాని లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఆరోగ్య భారతే ప్రధాని లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్య భారతే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పసి పిల్లలకు బెస్ట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ అమ్మేనని.. ఆరోగ్యకరమైన మెడిసిన్ తల్లి పాలేనని తెలిపారు. హైదరాబాద్‌‌‌‌ నాంపల్లిలో హెల్దీ బేబీ షో కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. పసి పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్య భారత్ నిర్మాణం అవుతుందని చెప్పారు. దేశంలోని ప్రతి పార్లమెంట్‌‌‌‌ నియోజక వర్గంలో హెల్దీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని ఆదేశించారన్నారు. 3 నెలల నుంచి 13 నెలల పసి పిల్లలతో హెల్దీ బేబీ షో నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళ లపై వివక్ష, సాంఘిక దురాచారాన్ని నిర్మూలించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.