కొండ కిటకిట.. భక్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం

కొండ కిటకిట.. భక్తులకు పోలీసులకు మధ్య  వాగ్వాదం

తిరుమల కొండ కిటకిటలాడుతోంది.  వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి.  క్యూలైన్లు రద్దీగా మారాయి.  దీంతో   భక్తులను క్యూలైన్లోకి పంపడం నిలిపివేశారు టిటిడి అధికారులు. దర్శనానికి అ‌ఉమతించాలంటూ భక్తులు రోడ్లపై ఆందోళనకు దిగారు.  తమకు దర్శనం చేయించాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు,  విజిలెన్స్ సిబ్బంది  భక్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.  దర్శనానికి అనుమతించాలంటూ వారితో భక్తులు వాగ్వాదానికి దిగారు. 

ఇప్పటికే కంపార్ట్ మెంట్లలో ఉన్న  సర్వదర్శనం భక్తులకు మాత్రమే ఇవ్వాళ రాత్రికి ( డిసెంబర్​ 22)  అందరిని  దర్శనం చేయిస్తామని టిటిడి అధికారులు చెబుతున్నారు.  మరోవైపు శనివారం ( డిసెంబర్​ 23)  వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ చేశారు..