
హైదరాబాద్ మల్లంపేట్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీళ్ళు చేరాయి. భారీ వర్షాలతో పక్కనే ఉన్న కత్వ చెరువు నిండుకుండలా ా మారింది. దీంతో సర్వీస్ రోడ్డుపైకి వరద వస్తోంది. ఓ ఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది.
దీంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మూసేశారు అధికారులు. మల్లంపేట్ నుంచి దుండిగల్, బాచుపల్లి, మియపూర్ వెళ్లాలంటే ఇదే రూట్. వరద నీటితో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో మల్లంపేట నుంచి దుండిగల్, బాచుపల్లి, మియాపూర్ కు రాకపోకలు బంద్ అయ్యాయి.