నిజాంసాగర్ ​ప్రాజెక్ట్​లోకి భారీగా వరద

నిజాంసాగర్ ​ప్రాజెక్ట్​లోకి భారీగా వరద

కామారెడ్డి, నిజాంసాగర్, వెలుగు : నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులకు గాను బుధవారం రాత్రి వరకు 1,402 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 12,500 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జిల్లాలో బుధవారం అక్కడక్కడా వర్షం కురిసింది.

జుక్కల్​లో 46 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగిరెడ్డిపేటలో 30 మి.మీ., మద్నూర్​లో 22.2 మి.మీ., పెద్దకొడప్​గల్​లో 24.4 మి.మీ., నస్రుల్లాబాద్​లో 25.3 మి.మీ., లింగంపేటలో 20 మి.మీ. వర్షపాతం నమోదైంది.