మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. వరద పోటెత్తడంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. పలు రోడ్లు, కాలనీలు చెరువులుగా మారిపోయాయి. జిల్లెలగూడలో చెరువు పొంగడంతో .. కాలనీలను వరద ముంచెత్తింద ి. దీంతో వందలాది ఇళ్లు నీటమునిగాయి. ఇండ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. నిత్యావసరాలు తెచ్చుకోవడానికి అవకాశం లేకపోవడంతో ప్రజలు పస్తులుంటున్నారు. పాలు కూడా లేవని వాపోతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు.