చైనాలో భారీ వర్షాలు.. 20 మంది మృతి

చైనాలో భారీ వర్షాలు.. 20 మంది మృతి

బీజింగ్: చైనాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బీజింగ్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటిదాకా 20 మంది చనిపోయారు. మరో 27 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు నీటమునగగా.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల్లో కార్లు, ఇతర వెహికల్స్ కొట్టుకుపోయి ఒకదానిపై మరొకటి గుట్టలుగా పేరుకుపోయాయి. వర్షాలతో మరింత నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ముంపు ఏరియాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బీజింగ్‌‌‌‌ చుట్టూ పర్వతాలు ఉండటంతో వరద ఉధృతి ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు.