పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగకు వెళ్లిన జనం.. మళ్లీ పట్నం బాట పట్టారు. దీంతో రోడ్లపై వాహనాలు కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ నెలకొంది. ఈ రద్దీని నియంత్రించేందుకు అధికారులు17 బ్లాక్ స్పాట్స్ ను ఏర్పాటు చేశారు.  అందులో భాగంగా నవాబు పేట నుంచి పెద్దకాపర్తి వరకు ప్రమాద ప్రాంతంగా గుర్తించారు. సెలవులకు, పండుగకు సొంతూళ్లకు వెళ్లి, తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటుండడంతో విజయవాడ హైవే బిజీగా మారింది. దీంతో గత 2,3 రోజుల నుంచీ బోసిపోయిన హైదరాబాద్ రోడ్లు.. మళ్లీ జనసంద్రంగా మారుతున్నాయి.