నేపాల్ లో హెలికాప్టర్ అదృశ్యమైంది. ఛాపర్ సోలుఖుంబు నుంచి ఖాట్మండుకు వెళుతున్న హెలికాప్టర్ ఇవాళ ఉదయం 10 గంటల15 నిముషాలకు కంట్రోల్ టవర్తో డిస్కనెక్ట్ అయ్యిందని అధికారి జ్ఞానేంద్ర భుల్ తెలిపారు. అదృశ్యమైన హెలికాప్టర్లో ఐదుగురు విదేశీయులు ఉన్నారని వెల్లడించారు.
సోలుఖుంబులోని సుర్కి నుండి బయలుదేరిన మనంగ్ ఎయిర్ హెలికాప్టర్ ఫ్లైట్లోకి 15 నిమిషాలకు కాంటాక్ట్లెస్గా వెళ్లిందని ఖాట్మండు పోస్ట్ నివేదించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ తో సంబంధాలు నెలకొల్పేందుకు యత్నిస్తున్నారని చెప్పారు.