గుంటూరు కారం అప్డేట్ అడిగిన హీరో నితిన్.. కారణం ఏంటో తెలుసా?

గుంటూరు కారం అప్డేట్ అడిగిన హీరో నితిన్.. కారణం ఏంటో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur Kaaram). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిజానికి ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన సాంగ్స్ అండ్ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. అందుకే గుంటూరు కారం అప్డేట్స్ కోసం మహేష్ ఫ్యాన్స్ చిత్ర నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేరిపోయారు.

ఆయన కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ లాగే గుంటూరు కారం అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారట. ఇందులో భాగంగానే హీరో నితిన్ గుంటూరు కారం నిర్మాతకు ఓ ట్వీట్(ఎక్స్) చేశారు.. గుంటూరు కారం రెండో పాట ఎప్పుడు విడుదల చేస్తున్నారు? అప్‌డేట్‌ ఎప్పుడు? మేం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.. అంటూ పోస్ట్‌ పెట్టాడు నితిన్. ఇక నితిన్ పెట్టిన పోస్ట్ కు స్పందించిన నిర్మాత నాగ వంశీ.. ఆ పనిలోనే ఉన్నాం నిత్యం స్వామీ.. అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.