
హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం లాంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభం లోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు వరుణ్ సందేశ్(Varun Sandesh). కొంత గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లేటెస్ట్ గా 'విరాజి'(Viraaji) చిత్రంతో ఆడియెన్స్ను పలకరించాడు.
మహా మూవీస్, ఎమ్ 3 మీడియా పతాకంపై ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా విడుదలైన విరాజి రెండు డిఫరెంట్ లుక్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త పర్వాలేదనిపించాడు.
ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ (Aha)లో ఈ నెల (ఆగస్ట్ 22) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘చుట్టూ పిచ్చి ప్రపంచం. బయటపడతాడా? భయపెడతాడా?’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ పెట్టింది ఆహా. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ప్రమోదిని, రఘు కారు మంచి ప్రధాన పాత్రలు పోషించారు.
Chuttu Picchi Prapancham!?
— ahavideoin (@ahavideoIN) August 19, 2024
Bayatapadathada, Bayapedathada? ?
Watch #Viraaji Premieres 22nd August only on aha! #VarunSandesh pic.twitter.com/XdSQ3Zjp3y
కథ విషయానికి వస్తే ::
రకరకాల కారణాలతో సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండ్ అప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది కొండమీద ఉన్న పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ మోసపోయి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ పడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు. దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉంటారు. ఆ టైంలో ఆండీ (వరుణ్ సందేశ్) వారి దగ్గరికి వస్తాడు. ఆండీ వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటపడింది ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.