బుజ్జికొండవే సాంగ్ తల్లి తండ్రుల హృదయాలను తాకుతుంది: విక్టరీ వెంకటేష్

బుజ్జికొండవే సాంగ్ తల్లి తండ్రుల హృదయాలను తాకుతుంది: విక్టరీ వెంకటేష్

హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh) ప్రస్తుతం తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75వ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు. ఈ మూవీకు సైంధవ్ (Saindhav) అనే విభిన్న టైటిల్తో ఆడియన్స్ను అట్ట్రాక్ట్ చేశాడు. ఈ మూవీకి హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) తెరకెక్కిస్తున్నాడు. 

లేటెస్ట్గా హీరో వెంకటేష్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 29న రిలీజ్ కాబోయే థర్డ్ సింగిల్ బుజ్జికొండవే సాంగ్ ప్రతి తల్లి తండ్రుల హృదయాలను తాకుతుందని తెలిపారు.ఈ మూవీలో తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ ప్రేక్షకులతో పాటు అందరినీ కదిలిస్తుందని..వెంకీ  ప్రమోషన్లలో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన సైంధవ్ గ్లింప్స్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీ అమాంతం పెంచేసింది. దీంతో వెంకీ 75 వ మూవీ ఒక మైల్ స్టోన్గా మారడం కన్ఫమ్ అని తెలుస్తోంది. 

హై-యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.