Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్

Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్

తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో విశాల్(Vishal), మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. విశాల్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam) సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. కావాలనే తన సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని, తమిళ ఇండస్ట్రీలో తనను అణిచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. నష్టాల గురించి ఫిర్యాదు చేసిన వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని జిల్లాల్లో తన సినిమాకు థియేటర్స్ ఇవ్వడం లేదని, నా సినిమాలకు నష్టం జరిగేలా చేస్తే.. ఎవరినీ వదిలిపెట్టనని, చట్టపరంగా పోరాటం చేస్తానాని మండిపడ్డారు. ప్రస్తుతం హీరో విశాల్ చేసిన ఈ కామెంట్స్ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక రత్నం సినిమా విషయానికి వస్తే.. తమిళ మాస్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఏ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అవగా ఈ సినిమా రిలీజ్ కోసం విశాల్ ఫ్యాన్స్ తోపాటు, సినిమా లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇన్ని వివాదాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూడాలి.