
గత కొద్దీ రోజులుగా రాజ్ తరుణ్ (RajTarun) ప్రేమ వివాదం సీరియల్ మాదిరిగా ట్విస్టులతో నడుస్తున్న విషయం తెలిసిందే. లావణ్య అనే ఓ యువతి.. రాజ్ తరుణ్ మీద పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం చేసిన తెలిసిందే. ఈ వ్యవహారంలో తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా(Malvi Malhotra)తో రాజ్ తరుణ్ కి సంబంధం ఉందంటూ లావణ్య ఆరోపించగా..ఈ ఇస్యూ మరింత తీవ్రం అయింది.
కాగా నేడు జూలై 31న మొట్టమొదటిసారిగా మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి ప్రమోషన్స్ తో బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలో మీడియా నుంచి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మీ పేరు కూడా వినిపిస్తోంది కదా ప్రశ్నించగా.."నేను చెప్పాల్సినవి అన్నీ ముందే చెప్పాను..ఇక నుండి ఏది చేసినా మేము లీగల్ గానే ప్రోసీడ్ అవుతామని అన్నారు. అలాగే, కేసులు అయ్యాక కూడా జులై 24న కూడా మెసేజ్ చేసింది. అది కూడా పోలీసులకు సబ్మిట్ చేశానని అన్నారు.
అంతేకాదు 2020 లో నా మీద ఎటాక్ చేసిన క్రిమినల్స్ తో ఆమె టచ్ లోకి వెళ్ళింది కాబట్టి ఆమె కూడా క్రిమినల్ అని నా ఉద్దేశం" అంటూ మాల్వి మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం జరిగిన ఈ ప్రెస్ మీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.