
హీరోయిన్ మమతా మోహన్దాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను రజనీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశానని, ఆ సినిమా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సినిమా చేయకపోయినా బాగుండేదని ఆమె అన్నారు. ఆమె మాటలు విన్న నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఆమె రజనీకాంత్ తో ఏ సినిమా చేశారని, దానివల్ల ఆమెకు జరిగిన నష్టం ఏంటనే సర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? నటి మమతా మోహన్దాస్ చాలా కాలం తరువాత విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ మహారాజలో నటించారు.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. సినిమాలో మమతా మోహన్దాస్ పాత్రకు కూడా ప్రశంసలు దక్కాయి. ఇందులో భాగంగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మహారాజ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు.. నటిగా తన కెరీర్ గురించి, ఆ సమయంలో ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకోచ్చారు.
నేను రజనీకాంత్ హీరోగా చేసిన కుసేలన్(తెలుగులో కథానాయకుడు)లో ఒక సాంగ్ చేశాను. కానీ, ఎడిటింగ్ లో ఆ షాట్స్ మొత్తం తీసేశారు. కేవలం ఒక సెకన్ మాత్రమే ఉంచారు. రిలీజ్ తరువాత అది చూసి చాలా బాధపడ్డాను. అనవసరంగా ఆ సినిమాలో చేశాను అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు ఆమె. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.