గ్రూప్ 1 పై విచారణ.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

గ్రూప్ 1 పై విచారణ.. రేపటికి వాయిదా వేసిన  హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్ పై 2023 ఆగస్టు 02 బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 కీ విడుదల చేసినట్టు కోర్టుకు న్యాయవాదులు తెలపగా, ఫలితాలు ఎప్పుడు ప్రకటించనున్నారని కోర్టు ప్రశ్నించింది. 

ఇంకా ఫలితాల ప్రకటన తేదీని నిర్ణయించలేదని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. రేపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించనున్నారు.  కాగా  తెలంగాణలో 2023 జూన్ 11న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 

అయితే గ్రూప్‌ -1 పరీక్ష విషయంలో పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్  ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.