నవీన్ మిట్టల్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు

నవీన్ మిట్టల్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు
  • గుడిమల్కాపూర్‌‌‌‌ భూములకు ఎన్వోసీ ఇవ్వడంపై విచారణ 

హైదరాబాద్, వెలుగు: గుడిమల్కాపూర్‌‌‌‌, నానల్‌‌‌‌నగర్‌‌‌‌లో 5,282 చదరపు గజాల భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీ జారీ చేశారంటూ నమోదైన కేసులో ఐఏఎస్‌‌‌‌ అధికారి నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆధారాలను పరిశీలించకుండా ఎన్వోసీ ఇచ్చారనే కేసులో కింది కోర్టు కాగ్నిజెన్స్‌‌‌‌ తీసుకోకపోవడంపై నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ సహా 43 మందిపై శాంతి అగర్వాల్‌‌‌‌ అనే వ్యక్తి పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. దీంతో నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌తో పాటు ఇతర అధికారులకు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ టి.తుకారంజీ నోటీసులు జారీ చేశారు. 

సర్వే నం.284/8లోని భూమిపై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఇతరులతో నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ చేతులు కలిపారంటూ నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్‌‌‌‌ జ్యుడిషియల్‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌ కోర్టులో శాంతి అగర్వాల్‌‌‌‌ ప్రైవేటు పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు నవీన్‌‌‌‌ మిట్టల్, ఇతర ప్రభుత్వ అధికారులపై విచారణను పక్కకు పెట్టడాన్ని పిటిషనర్‌‌‌‌ సవాల్‌‌‌‌ చేశారు. విచారించిన కోర్టు ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నవీన్‌‌‌‌ మిట్టల్‌‌‌‌లకు నోటీసులు జారీ చేశారు.