కాంగ్రెస్ పార్టీ నుంచి TRSలోకి మారిన నలుగురు MLC లకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మండలిలో కాంగ్రెస్ పార్టీని TRS లో విలీనం చేసినట్లు మండలి చైర్మన్ ప్రకటించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన ప్రభాకర్ రావు, సంతోష్ కుమార్, ఆకుల లలిత, దామోదర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే శాసన మండలి చైర్మన్, మండలి కార్యదర్శితో పాటు ప్రభుత్వానికి కూడా నోటీసులు వెళ్లాయి. కాంగ్రెస్ శాసన మండలి పక్షాన్ని TRSలో విలీనం చేయాలని ఆ నలుగురు MLCలు లేఖ ఇవ్వగా… అప్పటి చైర్మన్ స్వామి గౌడ్ దాన్ని ఆమోదించారు. విలీనాన్ని సవాలు చేస్తూ న్యాయవాదులు మల్లేశ్వర రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనం పేరుతో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై పిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు …వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
నలుగురు MLCలకు హైకోర్టు నోటీసులు
- తెలంగాణం
- April 13, 2019
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్