హైదరాబాద్: హుస్సెన్సాగర్లో వినాయకుడి నిమజ్జనాలు చేయోద్దంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఆంక్షలు అమలుచేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హుస్సెన్సాగర్లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ రకమైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక కుంటలు ఏర్పాటుచేయాలని సూచించింది. ఈ క్రమంలో ట్యాంక్బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు చెప్పింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అక్కడే ఈ విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలో చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని కోర్టు సూచించింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. దూర ప్రాంతాల నుంచి నిమజ్జనాల కోసం ఒకే రోజు హుస్సేన్ సాగర్కు రాకుండా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని తెలిపింది. నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని చెప్పింది. నిమజ్జనం తర్వాత వెంటనే డెబ్రీస్ తొలగించాలని ఆదేశించింది. నిమజ్జనానికి వచ్చే వారు భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. రోడ్లపై రాకపోకలకు ఆటంకం కలిగేలా మండపాలు ఉండొద్దని ఆదేశించింది. మండపాల వద్ద ఎక్కువమంది గుమిగూడకుండా పోలీసులు చూడాలని చెప్పింది. మండపం నిర్వాహకులు శానిటైజర్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను ప్రోత్సహించాలని హైకోర్టు చెప్పింది. రాత్రి 10 తర్వాత మైకులను అనుమతించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
హుస్సేన్సాగర్లో నిమజ్జనాలపై హైకోర్టు ఆంక్షలు
- హైదరాబాద్
- September 9, 2021
మరిన్ని వార్తలు
-
నూట్రిషనల్ ప్రొడక్ట్లను అమ్మేందుకు .. డాక్టర్ రెడ్డీస్, నెస్లే జాయింట్ వెంచర్
-
ముగిసిన తొలి ఘట్టం.. ఆదిలాబాద్ సెగ్మెంట్కు 23 మంది నామినేషన్లు
-
సింగరేణిలో బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదు: వివేక్ వెంకటస్వామి
-
మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్రెడ్డి
లేటెస్ట్
- నూట్రిషనల్ ప్రొడక్ట్లను అమ్మేందుకు .. డాక్టర్ రెడ్డీస్, నెస్లే జాయింట్ వెంచర్
- ముగిసిన తొలి ఘట్టం.. ఆదిలాబాద్ సెగ్మెంట్కు 23 మంది నామినేషన్లు
- సింగరేణిలో బీఆర్ఎస్కు ఓట్లు అడిగే హక్కు లేదు: వివేక్ వెంకటస్వామి
- మోదీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్రెడ్డి
- బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలేవి?.. అక్రమాల్లో ఆ రెండు పార్టీలూ ఒక్కటే: అమిత్ షా
- మీ కాల్మొక్తా గేటు తీయుండ్రి ! నామినేషన్ టైం అయిపోయాక వచ్చిన అభ్యర్థి
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మే 27న పోలింగ్
- కాంగ్రెస్కు మహిళల ‘గ్యారంటీ’!
- మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!