మరియమ్మ కేసు సీబీఐకి అప్పగింతపై హైకోర్టు తీర్పు రిజర్వ్

మరియమ్మ కేసు సీబీఐకి అప్పగింతపై హైకోర్టు తీర్పు రిజర్వ్

అడ్డగూడూరు మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు విచారణలో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. విచారణకు సీబీఐ ఎస్పీ కళ్యాణ్, ఐబీ అధికారి సంబంద్ హాజరయ్యారు. ఈ కేసులో బాధ్యులైన ఇద్దరు పోలీస్ అధికారులను విధుల్లో నుంచి తొలగించామని కోర్టుకు చెప్పారు అడ్వకేట్ జనరల్. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే తెలంగాణ పోలీసులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందన్నారు ఏజీ. దీంతో మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలా వద్దా అన్న అంశంపై తీర్పు రీజర్వ్ చేసింది హైకోర్టు.