నిజామాబాద్ జిల్లా బోధన్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అంతేకాదు పలు ప్రాంతాల నుంచి బోధన్ కు అదనపు బలగాలను రప్పిస్తున్నారు. బాసర జోన్ పరిధిలో 500 మంది వివిధ కేడర్ అధికారుల బోధన్ కు రావాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ముఖ్య నేతలు బోధన్ కు రాకుండా పట్టణ శివారులో అన్ని దారులు మూసివేశారు.ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
మరిన్ని వార్తల కోసం