రోజు రోజుకు ముదురుతున్న హిజాబ్ వివాదం

రోజు రోజుకు ముదురుతున్న హిజాబ్ వివాదం

కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రెండు వర్గాల మధ్య గోడవలు తీవ్రమవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ట్విట్టర్ వేదికగా కోరారు. ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మూడురోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు విచారణ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్లు తెలుస్తోంది.