తమిళనాడుకు షాక్.. ఫైనల్లో హిమాచల్ గ్రేట్ విక్టరీ

తమిళనాడుకు షాక్.. ఫైనల్లో హిమాచల్ గ్రేట్ విక్టరీ
  • తమిళనాడుకు ఊహించని షాక్ 
  • ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ గ్రేట్ విక్టరీ

విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌ –2021 విజేతగా  హిమాచల్‌ ప్రదేశ్‌ నిలిచింది. తమిళనాడుపై గ్రేట్ విక్టరీ సాధించి ఎవ్వరూ ఊహించని విజయంతో ఫైనల్లో గెలిచి సత్తా చాటింది. ఆదివారం  హిమాచల్ ప్రదేశ్ తో  జరిగిన ఫైనల్లో టాస్ ఓడిన తమిళనాడు నిర్ణీత 49.04 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 314 రన్స్ చేసింది. దినేష్ కార్తీక్ 116 సెంచరీతో చెలరేగాడు.  315 టార్గెట్ తో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ ఆరంభం నంచే ఆచితూచి ఆడుతూ మ్యాచ్ విక్టరీపై పట్టు సాధించింది. ఓ దిశలో 100 లోపు 3 వికెట్ల కోల్పోయిన హిమాచల్ .. ఆ తర్వత నెమ్మదిగా ఆడుతూ వికెట్ ను కాపాడుకుంది. అవసరమైన రన్ రేట్ తో ఆడుతూ విజయం దిశగా ఆట మొదలుపెట్టిన హిమాచల్ ప్రదేశ్.. అనుకున్నంత పని చేసింది. ఓపెనర్ శుభమ్ ఆరోరా గ్రేట్ సెంచరీతో(136 నాటౌట్) విక్టరీలో కీలక పాత్ర వహించాడు. తమిళనాడుపై 6 వికెట్ల తేడాతో  గెలిచి విజేతగా నిలిచింది హిమాచల్ ప్రదేశ్.