
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశముందంటున్నారు.