హైదరాబాద్కు హోంమంత్రి అమిత్షా

హైదరాబాద్కు హోంమంత్రి అమిత్షా

హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్,  బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎంపీ అర్వింద్, ఇతర బీజేపీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్ సీఆర్ పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ కు బయల్దేరారు. ఈ రాత్రికి సీఆర్ పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో బస చేయనున్నారు.  

ఈ పర్యటనలో అమిత్ షా పలువురు ప్రముఖులతో సమావేశం కానున్నారు.. ఇందులో భాగంగా రాత్రి (సెప్టెంబర్ 16న)  సీఆర్ పీఎఫ్ ఆఫీసర్స్ మెస్ లో ప్రముఖ క్రీడాకారిణి పీవీ సింధుతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.