హోండా కార్ల ధరలు పెరుగుతున్నయ్​

హోండా కార్ల ధరలు పెరుగుతున్నయ్​

న్యూఢిల్లీ: ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ మోడల్స్ అయిన హోండా సిటీ, హోండా అమేజ్,  హోండా డబ్ల్యుఆర్-వీల ధరలను పెంచామని హోండా కార్స్​ ఇండియా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఇది రెండో పెంపు. మోడల్​ను బట్టి ధరల పెరుగుదల రూ.11,900 నుండి రూ.20వేల మధ్య ఉంటుంది.  హోండా డబ్ల్యూఆర్​వీ ఎస్​యూవీ  పెట్రోల్ వేరియంట్ రూ.11,900 పెరిగింది.  డీజిల్ వేరియంట్​కు ఇక నుంచి రూ.12,500 ఎక్కువ చెల్లించాలి. హోండా డబ్ల్యూఆర్​వీ ప్రస్తుత ధర రూ.8.88 లక్షల నుండి రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)  అయింది. టాప్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.12.24 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా సిటీ సెడాన్ ఫోర్త్​ జనరేషన్​ మోడల్ మాన్యువల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి  రూ.9.50 లక్షలకు చేరింది.  హోండా సిటీ సెడాన్ వేరియంట్ల ధరలు కూడా (పెట్రోల్,  డీజిల్) రూ.17,500 వరకు పెరిగాయని కంపెనీ ప్రకటించింది.  హోండా సిటీ సెడాన్  ప్రారంభ ధర ఇప్పుడు రూ.11.46 లక్షలు కాగా, వేరియంట్​ను బట్టి  ధరలు రూ.15.47 లక్షల వరకు పెరుగుతాయి. పోయిన సంవత్సరం లాంచ్​ చేసిన హోండా అమేజ్ ఫేస్‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ సెడాన్, దాని పెట్రోల్  డీజిల్ వేరియంట్‌‌‌‌‌‌‌‌ ధర రూ.12,500 పెరిగింది. హోండా అమేజ్ తాజా ధర ఇప్పుడు రూ.6.43 లక్షలకు బదులుగా రూ.6.56 లక్షలు అయింది.  హోండా జాజ్ ధరలు కూడా రూ.12,500 వరకు పెరిగాయి.