రాళ్లతో దాడి చేస్తూ చోరీలకు పాల్పడుతున్న పోకిరీలు

రాళ్లతో దాడి చేస్తూ చోరీలకు పాల్పడుతున్న పోకిరీలు

హైదరాబాద్ : సిటీలో గంజాయి మత్తులో కొందరు యువకులు రోడ్లపై హల్ చల్ చేస్తున్నారు. హైదరాబాద్ అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలీ కేఫ్ చౌరస్తా దగ్గర యువకులు జనాన్ని భయపెట్టిస్తున్నారు. దారిలో వచ్చిపోయే వారిపై రాళ్లతో దాడి చేసి గాయపరుస్తున్నారు. వారి దగ్గర నుంచి డబ్బులు, సెల్ ఫోన్లు దోచుకుంటున్నారు. దీంతో యువకుల దాడిలో గాయపడుతున్నవారు ఆస్పత్రుల పాలు అవుతున్నారు. యువకుల హల్ చల్ కు సంబంధించి విజువల్స్ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.  అయితే యువకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నా… పోలీసులు పట్టించుకోవటం లేదంటున్నారు స్థానికులు.