గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800

గ్రామాల్లో ఇండ్ల మ్యుటేషన్‌కు చార్జీ రూ.800

గరిష్టంగా రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం ఫీజు

ధరణి పోర్టల్‌‌ ద్వారానే పంచాయతీల ఆస్తుల రిజిస్ట్రేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ కనీస చార్జీని రూ.800గా నిర్ణయిస్తూ సర్కార్ మంగళవారం ఆర్డర్ జారీ చేసింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 0.1 శాతం లేదా రూ.800 చెల్లించాలని, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అదే చార్జీ వసూలు చేయాలని అందులో పేర్కొంది. ఇప్పటి వరకు పంచాయతీల తీర్మానం మేరకే మ్యుటేషన్ చార్జీలు వసూలు చేసేవారు. చార్జీలు పంచాయతీకో తీరుగా ఉండడం కరెక్ట్ కాదని భావించిన సర్కార్ అన్ని పంచాయతీల్లో ఒకే విధంగా ఉండాలని భావించి ఈ చార్జీలను నిర్ణయించినట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్‌‌ ఫీజును సబ్‌‌ రిజిస్ట్రార్‌‌  ఆఫీసుల్లోనే వసూలు చేసి, తర్వాత పంచాయతీలకు ట్రాన్స్​ఫర్‌‌ చేస్తారు.

రిజిస్ట్రేషన్ కాంగనే మ్యుటేషన్

ఇంతకుముందు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులను పంచాయతీ రికార్డుల్లో మార్చుకునేందుకు ప్రత్యేకంగా పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. మ్యుటేషన్​ పూర్తయ్యేందుకు ఒక్కోసారి నెలల తరబడి టైం పట్టేది. కానీ ఇకపై రిజిస్ట్రేషన్‌‌, మ్యుటేషన్ లో పంచాయతీల ప్రమేయం ఉండదు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కాగానే అక్కడికక్కడే మ్యుటేషన్ చేయనున్నారు. ఇందు కోసం ధరణితో ఇ–పంచాయతీ పోర్టల్‌‌ను కనెక్ట్ చేయనున్నారు.

For More News..

అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో క్రికెట్‌‌ లైవ్‌‌