హైదరాబాద్‌ లో దారుణం… తల్లీ కూతుళ్లపై అఘాయిత్యం..!

హైదరాబాద్‌ లో దారుణం… తల్లీ కూతుళ్లపై అఘాయిత్యం..!

హైదరాబాద్:  చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో దారుణం జ‌రిగింది. పాపిరెడ్డి కాలనీ, సందయ్య నగర్ లో ముగ్గురు (ఇంటి యజమాని.. అతని మిత్రులు)కలిసి తల్లి ( 35 ), కూతురు (15) లపై అత్యాచారం చేశారు. మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంటల సమయంలో చికెన్‌ లో మత్తు పదార్థం కలిపి ఈ గ్యాంగ్ దారుణానికి పాల్పడిందని సమాచారం. చికెన్ తిన్న ఆమె కొడుకు(10) పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారట. ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తల్లీ కూతుళ్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.