దారుణం: ఇంటి అద్దె అడిగాడని ఓనర్‌ హత్య

దారుణం: ఇంటి అద్దె అడిగాడని ఓనర్‌ హత్య

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అమానుషం చోటుచేసుకుంది. ఇంటి అద్దె అడిగాడని ఓనర్‌ని రాయితో కొట్టి చంపాడో వ్యక్తి. ఇంటి యజమాని వంగా ప్రసాద్‌ ఇంట్లో అడపా చిన్న కొండయ్య అనే వ్యక్తి కుటుంబం కలిసి అద్దెకు ఉంటున్నాడు. కాగా గత కొన్నాళ్ల నుంచి కొండయ్య అద్దె ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దాంతో వెంటనే ఇంటి అద్దె మొత్తం చెల్లించాలని కొండయ్య మీద ఇంటి ఓనర్ ప్రసాద్ ఒత్తిడితెచ్చాడు. దాంతో కోపోద్రిక్తుడైన కొండయ్య.. ఓనర్ ప్రసాద్‌ను రాయితో కొట్టి చంపాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.