తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 40 గంటలు

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 40 గంటలు

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలా తోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వ దర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ భక్తులకు 5 గంటల సమయం పడుతుందన్నారు. మరో రెండు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు ఇవాళ తిరుమలలో జరగాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమం రద్దయింది. వర్షం కారణంగా పార్వేటి మండపం దగ్గర నిర్వహించాల్సిన కార్యాక్రమాన్ని టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆలయంలో పలు అర్జిత సేవలను కూడా రద్దు చేశారు. అర్చకులు వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.