యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదగిరిగుట్ట  లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అదివారం సెలవు కావడం, స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి కావడంతో ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు,సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది.  భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ​అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.