టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జికి నిధులు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి

టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జికి నిధులు మంజూరు : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • త్వరలోనే  పనులు చేపడుతామని వెల్లడి

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.11.19 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ ​వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల శివారులోని వాగు ప్రవాహం పెరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి వివేక్​ పరిశీలించారు. 

వాగుపై ఉన్న లోలెవల్​ బ్రిడ్జి మీదుగా వరద ప్రవాహం పెరగడంతో ఇందారం నుంచి కుందారం వరకు రాకపోకలు కష్టంగా మారుతున్నాయని కాంగ్రెస్ ​లీడర్లు, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.