చందానగర్ లో పట్టపగలు ఆఫీసులోనే భార్యను కొట్టి చంపిన భర్త

చందానగర్ లో పట్టపగలు ఆఫీసులోనే భార్యను కొట్టి చంపిన భర్త

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న చందానగర్ లో పట్టపగలు దారుణం జరిగింది. ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో ఓ బొటిక్ నడస్తుంది. ఈ బొటిక్ లో 27 ఏళ్ల అంబిక అనే యువతి కొన్నాళ్లుగా పని చేస్తూ ఉంది. ఈమెకు పెళ్లయ్యి భర్త, కుమార్తె ఉన్నారు. ఏడాది కాలంగా భర్త నరేందర్ తో గొడవలు జరుగుతున్నాయి. బొటిక్ లో పని చేయటం మానేయాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. భార్య అంబిక మాత్రం ఉద్యోగం మానేసిది లేదని స్పష్టం చేస్తూ వస్తుంది. 

ఈ క్రమంలోనే శుక్రవారం బొటిక్ దగ్గరకు వచ్చాడు భర్త నరేందర్. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాటా పెరిగి.. భార్య అంబికను.. బొటిక్ ఆఫీసులోనే బండ రాయితో కొట్టి చంపాడు భర్త నరేందర్. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది అంబిక. తన కుమార్తె ఎదుట నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. హత్య చేసిన నరేందర్ వివరాలు సేకరిస్తున్నారు.

భర్య అంబికపై అనుమానంతోనే.. భర్త నరేందర్ ఈ హత్య చేశాడని ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. కొన్ని నెలలుగా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారని తెలిపారు.